- Home
- Entertainment
- సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? తొలి చిత్రంతోనే ఫిదా, కనీసం ఆమె పేరు కూడా తెలియదు
సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? తొలి చిత్రంతోనే ఫిదా, కనీసం ఆమె పేరు కూడా తెలియదు
సౌందర్య అద్భుతమైన అందం, అత్యద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. మరి ఆమెకి ఇష్టమైన నటి ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
చీరకి అందం తెచ్చిన నటి సౌందర్య
సహజమైన సౌందర్యంతో ఆకట్టుకుంది సౌందర్య. అంతేకాదు, అంతే సహజమైన నటనతోనూ మెప్పించింది. సావిత్రి తర్వాత అంతటి గొప్ప నటిగా రాణించింది సౌందర్య. తెలుగు హీరోయిన్లు గ్లామర్ షోతో రెచ్చిపోతున్న సమయంలోనూ కూడా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించి ఆకట్టుకుంది.
ఇంకా చెప్పాలంటే చీరకి అందం తెచ్చిన నటి సౌందర్య. తాను నటించిన సినిమాల్లో గ్లామర్ లేదనే ఆలోచనే రాకుండా చేసింది. అంతటి అద్భుతమైన అభినయంతో మెప్పించి తిరుగులేని స్టార్ హీరోయిన్గా రాణించింది.
బలవంతంగా సినిమాల్లోకి వచ్చిన సౌందర్య
సౌందర్య.. సినిమా ఎంట్రీ అనుకోకుండా జరిగిందనే విషయం తెలిసిందే. టెంన్త్ అయిపోయాక సడెన్గా ఓ రోజు తన తండ్రి వచ్చి ఆమెని షూటింగ్కి తీసుకెళ్లాడట. ఇలా సినిమాల్లో చేయాలని చెబితే తనకు ఇష్టం లేదని ఏడ్చిందట. అయినా వినలేదు వాళ్ల ఫాదర్. షూటింగ్ వెళ్లాక వాళ్లు మేకప్ వేసి ఎలా చేయమని చెబితే, అలా చేసి వచ్చిందట. అలా కన్నడ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్
ఓ ఇంటర్వ్యూలో సౌందర్య మాట్లాడుతూ తనకిష్టమైన హీరోయిన్ ఎవరో చెప్పింది. సావిత్రి అంటే ఇష్టమని తెలిపింది. తాను చూసిన మొదటి సినిమాతోనే ఆమెకి ఫిదా అయ్యిందట సౌందర్య. అప్పటికీ తాను స్కూల్ చదివే ఏజ్, సినిమాలంటే ఏంటో కూడా తెలియదు. ఆ సమయంలో బెంగుళూరులో మొదటిసారి తెలుగు సినిమా చూసింది. అదే `మాయా బజార్`.
సావిత్రి ప్రెట్టీగా, చబ్బీగా ఉండేది
ఈ మూవీ తనకు బాగా నచ్చిందట. ముఖ్యంగా సావిత్రి ఇంకా బాగా నచ్చిందట. ఆ టైమ్కి ఆమె సావిత్రి అని సౌందర్యకి తెలియదు. తర్వాత ఆమె గురించి చెప్పారట. కానీ ఆమె నటనకు ఫిదా అయ్యింది.
తర్వాత సావిత్రి నటించిన `గుండమ్మ కథ`, `మిస్సమ్మ` చిత్రాలు చూసినట్టు తెలిపింది సౌందర్య. ఆమె అందంగా, చబ్బీగా ఉండేదని, ఆమెని అలా చూసి ముచ్చటేసిందని తెలిపింది. అంతేకాదు సావిత్రి చాలా ఎక్స్ ప్రెసివ్ అని, ఆమె నటనకు అప్పుడే ఫిదా అయినట్టు తెలిపింది సౌందర్య.
సౌందర్య జీవితం విషాదం
సావిత్రి తర్వాత చాలా మంది హీరోయిన్లు వచ్చారు. కానీ ఎవరికీ ఆ స్థాయి ఇమేజ్ రాలేదు. అప్పట్లో చాలా మంది సౌందర్యని మరో సావిత్రిగా అభివర్ణించారు. సౌందర్య చిన్న ఏజ్(31)లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు.