తెలంగాణ ప్రజలపై ఆర్టీసీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సాధారణ ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు, విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది. ఇంతకీ విషయం ఏంటంటే..
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ప్రజలకు గట్టి షాక్ ఇచ్చింది. రవాణా సేవలను ఉపయోగించుకునే సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం చూపేలా బస్ పాస్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ కొత్త టారిఫ్లు ఈ రోజు (జూన్ 9) నుంచి అమల్లోకి వచ్చాయి.
అధికారిక సమాచారం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20% నుంచి 25% వరకూ పెంచినట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రజలపై నెలవారీగా రవాణా ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
తాజా పెరిగిన RTC బస్ పాస్ ధరలు:
ఆర్డినరీ పాస్: రూ. 1,150 నుంచి రూ. 1,400కి పెంపు
మెట్రో ఎక్స్ప్రెస్ పాస్: రూ. 1,300 నుంచి రూ. 1,600కి పెంపు
మెట్రో డీలక్స్ పాస్: రూ. 1,450 నుంచి రూ. 1,800కి పెంపు
గ్రేటర్ హైదరాబాద్ పాస్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా స్పష్టంగా పెరిగినట్టు సమాచారం. ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.